గ్వాలియర్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఒక ప్రధాన నగరం. గ్వాలియర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది ఢిల్లీకి దక్షిణంగా 343 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆగ్రా నుండి 120 కి.మీ., రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 414 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ నగరంపై వలస వచ్చేవారి వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన కౌంటర్-మాగ్నెట్ నగరాల్లో ఇది ఒకటి. గ్వాలియర్ భారతదేశంలోని గిర్డ్ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది.. ఈ చారిత్రిక నగరాన్ని, దాని కోటనూ అనేక ఉత్తర భారత రాజ్యాలు పాలించాయి. 10 వ శతాబ్దంలో కచ్ఛపగతులు, 13 వ శతాబ్దంలో తోమర్లు, ఆ తరువాత మొఘలులు, 1754 లో మరాఠాలు, తరువాత 18 వ శతాబ్దంలో సింధియాలూ పాలించారు. 2016 లో పట్టణ కాలుష్యంపై జరిపిన అధ్యయనంలో ఈ నగరం భారతదేశంలో అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరమని, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందనీ తేలింది.[4]
గ్వాలియర్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
మెట్రోపాలిటన్ నగరం | ||||||||
Clockwise from top: Gwalior Fort and the city skyline, Jai Vilas Mahal Interior, British era monument, Sanatan Dharam Mandir, Jai Vilas Palace, Jhansi ki Rani monument, Birla Sun Temple of Gwalior | ||||||||
Coordinates: 26.221521°N 78.178024°E / 26.221521; 78.178024 | ||||||||
దేశం | భారతదేశం | |||||||
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ | |||||||
ప్రాంతమ్ | గిర్డ్ | |||||||
జిల్లా | గ్వాలియర్ | |||||||
Founded by | Suraj Sen (according to a legend) | |||||||
Area | ||||||||
• మెట్రోపాలిటన్ నగరం | 289 km2 (112 sq mi) | |||||||
Elevation | 211 మీ (692 అ.) | |||||||
Population (2011)[2] | ||||||||
• మెట్రోపాలిటన్ నగరం | 10,69,276 | |||||||
• Density | 5,478/km2 (14,190/sq mi) | |||||||
• Metro | 11,17,740 | |||||||
• జనాభా ర్యాంకు | 48 | |||||||
భాష | ||||||||
• అధికారిక | హిందీ[3] | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 474001 to 474055 (HPO) | |||||||
టెలిఫోన్ కోడ్ | 0751 | |||||||
Vehicle registration | MP-07 | |||||||
లింగ నిష్పత్తి | 930 ♂/♀ |
గ్వాలియర్ మాజీ మధ్య భారత్ రాష్ట్రానికి శీతాకాల రాజధాని, తరువాత ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. భారత స్వాతంత్ర్యానికి ముందు గ్వాలియర్, బ్రిటిష్ పాలనలో సంస్థానంగా సింధియాలు స్థానిక పాలకులుగా కొనసాగింది. ఎత్తైన రాతి కొండలు నగరాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఉంటాయి. ఉత్తరాన ఇది గంగా- యమునా డ్రైనేజ్ బేసిన్కు సరిహద్దుగా ఉంది. అయితే ఈ నగరం కొండల మధ్య లోయలో ఉంది. గ్వాలియర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో గ్వాలియర్ నగరం, మోరార్ కంటోన్మెంట్,[2] లష్కర్ గ్వాలియర్ (లష్కర్ ఉపనగరం), మహారాజ్ బడా, ఫూల్ బాగ్, తటీపూర్లు భాగంగా ఉన్నాయి .
పురాణాల ప్రకారం, గ్వాలిపా అనే సిద్ధుడు ఇచ్చిన పానీయం తాగడంతో, స్థానిక అధిపతి సూరజ్ సేన్కు కుష్టు వ్యాధి నయం అయింది. సా.శ. 8 లో అతడి పేరిట గ్వాలియర్ నగరాన్ని స్థాపించాడు.[5]
గ్వాలియర్ వద్ద లభించిన తొలి చారిత్రక రికార్డు హూణ పాలకుడు మిహిరకులుడు వేయించిన శాసనం. మిహిరకులుడి తండ్రి తోరమానుడు (493-515) ను కీర్తిస్తూ "[భూమి] యొక్క పాలకుడు, గొప్ప యోగ్యత కలిగినవాడు, అద్భుతమైన తోరమానుడి పేరుతో ప్రసిద్ధి చెందాడు; వీరి ద్వారా, ప్రత్యేకించి నిజాయితీతో కూడిన (అతని) వీరత్వం ద్వారా భూమి ధర్మంగా పరిపాలించబడింది"
9 వ శతాబ్దంలో, గుర్జర-ప్రతీహార రాజవంశం గ్వాలియర్ను పాలించింది, తమ పాలనలో వారు తేలి కా మందిర్ ఆలయాన్ని నిర్మించారు. 1021 లో గ్వాలియర్ను మహమూద్ ఘజ్ని నేతృత్వంలోని దళాలు దాడి చేశాయి, కాని గ్వాలియర్ పాలకులు వారిని తిప్పికొట్టారు.[5]
1231 లో ఇల్టుట్మిష్ 11 నెలల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నాడు, అప్పటి నుండి 13 వ శతాబ్దం వరకు ఇది ముస్లింల పాలనలో ఉంది. 1375 లో రాజా వీర్ సింగ్ గ్వాలియర్ పాలకుడయ్యాడు. అతను తోమర్ వంశ పాలనను స్థాపించాడు. వారి పాలనా కాలంలో గ్వాలియర్ స్వర్ణ దశను అనుభవించింది.
గ్వాలియర్ కోటలోని జైన శిల్పాలు తోమర్ పాలనలో నిర్మించారు. మాన్ సింగ్ తోమర్ తన కలల భవంతి, మాన్ మందిర్ ప్రాసాదాన్నినిర్మించాడు. గ్వాలియర్ కోట వద్ద ఇప్పుడిది ఒక పర్యాటక ఆకర్షణ.[6] బాబర్ "ఇది భారతదేశపు కోటల హారంలో ఉన్న ముత్యం, గాలులు కూడా దాని బురుజులను తాకలేవు" అని ఈ కోట గురించి అభివర్ణించాడు. అక్కడ ఏర్పాటు చేసిన రోజువారీ సౌండ్ అండ్ లైట్ షో గ్వాలియర్ కోట, మాన్ మందిర్ ప్రాసాదాల చరిత్ర గురించి చెబుతుంది. 15 వ శతాబ్దం నాటికి, నగరంలో ప్రసిద్ధ సంగీత పాఠశాల ఉంది. ఇక్కడ తాన్సేన్ అభ్యసించాడు. తరువాత 1730 లలో, సింధియాలు గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఇది ఒక సంస్థానంగా మిగిలిపోయింది.
గ్వాలియర్ కోటలోని చతుర్భుజ్ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సున్నాను ఇక్కడే లిఖించినట్లు పేర్కొంది.[7]