గుల్జార్ దెహ్లవి
From Wikipedia, the free encyclopedia
గుల్జార్ దెహ్లవి : పండిత్ ఆనంద్ మోహన్ జుత్షి "గుల్జార్" దెహ్లవి. సమకాలీన ఉర్దూ కవులలో అత్యంత ప్రముఖమైన పేరు. ఉర్దూ ముషాయిరాలు గుల్జార్ దెహ్లవి అధ్యక్షతన అనేకం జరుగుతున్నవి. ఉర్దూ ముషాయిరాలు, భారత్ నుండి దుబాయి వరకు ఇతని పరిణతి చెందిన ఉర్దూ ప్రసంగాలు, కవితలచే నడుస్తున్నవి.
ఉర్దూ కవి, ప్రముఖ పత్రికా రంగ ప్రముఖుడిగా పేరు గలదు. మహాత్మాగాంధీ, జవాహర్ లాల్ నెహ్రూల విధానాలచే ఆకర్షితుడైన ఆనంద్ మోహన్, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత రాజకీయరంగంలోను, పత్రికారంగంలోనూ కొనసాగాడు. ప్రస్తుతం ఉర్దూ సాహితీరంగంలో స్థిరపడ్డాడు. ఆసియా ఖండంలోనే గాక, ఉర్దూ సాహిత్య ప్రపంచంలో ఓ ప్రముఖ సాహితీకారుడు, కవి.