గిసేప్పి గారిబాల్డి
From Wikipedia, the free encyclopedia
గిసెప్పి గరిబాల్డి (జూలై 4, 1807 - జూన్ 2, 1882) ఒక ప్రఖ్యాత ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. ఈయన ఈటలీ చరిత్రలో ముఖ్య పాత్ర పోషించాడు. కామిల్లో కావూర్, విక్టర్ ఇమ్మాన్యూల్ II, గిసెప్పి మాజినిలతో కలిపి ఈయనను కూడా ఇటలీ ఫాదర్స్ ఆఫ్ పాదర్స్ లాండ్ అని అంటారు
గిసెప్పీ గారీబాల్డీ | |
---|---|
జననం | (1807-07-04)1807 జూలై 4 నైస్, మొదటి ఫ్రెంచి సామ్రాజ్యం |
మరణం | 1882 జూన్ 2(1882-06-02) (వయసు 74) కాప్రియా, ఇటలీ రాజ్యం |
గారిబాల్డి ఇటలీ దేశ ఏకీకరణలో ప్రముఖ పాత్రను పోషించాడు. ఇటలీ ఏకీకరణకు దారితీసిన అనేక యుధ్ధాలలో పాల్గొనాడు. అంతేగాక సైనిక దళాలకు స్వయంగా నాయకత్వం వహించాడు. .1848 లో మిలాన్ నగర తాత్కాలిక ప్రభుత్వం గారిబాల్డిని జనరల్ గా నియమించింది. 1849 లో రోమన్ రిపబ్లిక్ యుద్ధమంత్రిత్వ శాఖ ఇతనిని జనరల్గా నియమించింది. విక్టర్ ఇమ్మాన్యూల్ IIకు మద్దత్తుగా వెయ్యి మందితో ఒక సాహసయాత్రకు నాయకత్వం వహించాడు.
దక్షిణ అమెరికాలో ఐరోపా లలో అనేక పోరాటాలలో పాల్గొన్నందున ఈయనను "హీరో ఆఫ్ టు వరల్డ్స్" అని పిలుస్తారు. ఈ సాహసోపేతమైన చర్యల వలన ఈయన ఇటలీలోను విదేశాలలోను గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు. వీటికి ఆ సమయంలోని అంతర్జాతీయ మీడియా విపరీతమైన ప్రాచుర్యం కలిపించింది.. ఆనాటి గొప్ప మేధావులన విక్టర్ హ్యూగో, అలెగ్జాండర్ డ్యూమాస్, జార్జ్ సాండ్ అతనికి గొప్ప అభిమానులు. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు అతనికి చాలా విధాలుగా సహాయం పడ్డాయి.ఆపత్సమయంలో ఆర్థిక సైనిక సహాయాన్ని అందించి ఆదుకున్నాయి.
నిజం చెప్పాలంటే అతని వాలంటీర్లు యూనిఫాంగా ధరించిన ఎరుపు రంగు చొక్కాలతో అతని కథ ముడిపడి ఉంది.