కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు
covid 19 virus / From Wikipedia, the free encyclopedia
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సార్స్-సీవోవీ-2 వైరస్ను గుర్తించగలదు. అంతే కాకుండా ఇది వైరస్ ఉనికిని గుర్తించే పద్ధతులు(ఆర్టి-పిసిఆర్, ఇసోథెర్మల్ న్యుక్లిక్ ఆసిడ్ ఆమ్ప్లిఫికేషన్), సంక్రమణకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే యాంటీబోడీస్ గుర్తించే పద్ధతులను కలిగి ఉంటుంది. రోగనిర్ధారణ, జనాభా పర్యవేక్షణ కోసం ప్రతిరోధకాలను గుర్తించే ప్రక్రియని (సీయెరాలజీ) ఉపయోగించవచ్చు. యాంటీబోడీస్ పరీక్షలు ఎంత మంది ఈ వ్యాధిని కలిగి ఉన్నారో, వీరిలో ఎంత మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేక అసలు లక్షణాలు లేవో కూడా చూపిస్తాయి. ఈ పరీక్ష ఫలితాల నుండి వ్యాధి ఖచ్చితమైన మరణాల రేటు, జనాభాలో రోగనిరోధక శక్తి స్థాయిని నిర్ణయించవచ్చు.
పరిమిత పరీక్షల కారణంగా, మార్చి 2020 నాటికి ఏ దేశమూ వారి జనాభాలో వైరస్ ప్రాబల్యంపై నమ్మదగిన డేటాను చుపించాలేకపోయాయి.[1] ఏప్రిల్ 29 నాటికి, వారి పరీక్ష డేటాను ప్రచురించిన దేశాలు సగటున వారి జనాభాలో 1.4% కు సమానమైన పరీక్షలను నిర్వహించాయి. ఏ దేశమూ దాని జనాభాలో 14% కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించలేదు.[2]
వివిధ దేశాల పరీక్షల సంఖ్యలలో తేడాలు ఉన్నాయి.[3]