కోమగట మారు సంఘటన
భారతీయ సిక్కు వలసదారులను కెనడాలో అడుగుపెట్టనీయని ఘటన / From Wikipedia, the free encyclopedia
కోమగట మారు అనే జపాను ఓడలో భారతీయులు కెనడాకు వలసపోగా వారిని కెనడాలో అడుగుపెట్టనీయకుండా వెనక్కి పంపేసిన ఘటనను కోమగట మారు సంఘటన అంటారు. ఈ ఓడలో బ్రిటిషు భారతదేశం నుండి ఒక సమూహం 1914 ఏప్రిల్లో కెనడాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే కెనడా, వారిలో చాలామందికి ప్రవేశం నిరాకరించి, వెనక్కి తిప్పి కోల్కతా (ప్రస్తుత కోల్కతా) కి పంపేసింది. కోల్కతాలో, ఇండియన్ ఇంపీరియల్ పోలీసులు ఆ గ్రూపు లీడర్లను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అల్లర్లు చెలరేగాయి, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు, ఫలితంగా 20 మంది మరణించారు.
తేదీ | 1914 మే 23 |
---|---|
ప్రదేశం | వాంకూవర్ |
ఫలితం | ఓడను బలవంతంగా కోల్కతా పంపేసారు |
మరణాలు | ప్రభుత్వ లెక్కల ప్రకారం 20. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 75 |
బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ నుండి 376 మంది ప్రయాణీకులను తీసుకుని కోమగట మారు బ్రిటిష్ హాంకాంగ్ నుండి షాంఘై, చైనా, జపాన్ లోని యోకోహామా మీదుగా కెనడాలోని వాంకోవర్కు 376 మంది ప్రయాణికులను తీసుకువెళ్ళింది. ప్రయాణీకులలో 337 మంది సిక్కులు, 27 మంది ముస్లింలు, 12 మంది హిందువులూ ఉన్నారు, వీరందరూ పంజాబీలే. [1] ఈ 376 మంది ప్రయాణీకులలో 24 మందిని కెనడాలోకి రానిచ్చారు. మిగిలిన 352 మందిని కెనడా గడ్డపై దిగడానికి అనుమతించలేదు. ఓడ కెనడా జలాలను విడిచిపెట్టవలసి వచ్చింది. కెనడాకు చెందిన మొదటి రెండు నావికాదళ నౌకలలో ఒకటైన HMCS రెయిన్బోను ఈ ఓడకు కాపలాగా ఉంచారు. [2] 20 వ శతాబ్దం ప్రారంభంలో కెనడా, అమెరికాల్లోని మినహాయింపు చట్టాలను వాడి, ఆసియా మూలానికి చెందిన వలసదారులను అడ్డుకున్న అనేక సంఘటనలలో ఇది ఒకటి.