ఎం.ఎన్.రాయ్
భారత రాజకీయ కార్యకర్త మరియు మేధావి / From Wikipedia, the free encyclopedia
ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ (మార్చి 21, 1887 – జనవరి 25, 1954) హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత,, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ పితామహుడు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు[2].రాయ్ బహుభాషా ప్రావీణ్యం కలవారు. 17 భాషలు వారికి తెలుసు. ఆంగ్లము, జర్మన్, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ మొదలగు భాషలలో వ్రాయడం, మాట్లాడడం, చదవడం వారికి వచ్చు.
M. N. Roy মানবেন্দ্রনাথ রায় మానవేంద్రనాథ రాయ్ | |
---|---|
జననం | నరేంద్రనాథ్ భట్టాచార్య (1887-03-21)1887 మార్చి 21 చాంగ్రిపొట, 24 ప్రాంగణాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1954 జనవరి 26(1954-01-26) (వయసు 66) |
జాతీయత | భారతీయుడు |
విశ్వవిద్యాలయాలు | బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జాదవ్పూర్ విశ్వవిద్యాలయం), కమ్యూనిస్ట్ యునివర్సిటీ ఆఫ్ ది టాయిలర్స్ ఆఫ్ ది ఈస్ట్ |
సంస్థ | Jugantar, Communist Party of India, Communist Party of Mexico, |
రాజకీయ ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమము, భారత్-జెర్మన్ కుట్ర, కమ్యూనిజం |