ఇందిరా గాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్
ఇందిరా గాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్ లేదా మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్, ఇది భారతదేశంలోని జమ్మూ / From Wikipedia, the free encyclopedia
ఇందిరా గాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్ లేదా మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్, ఇది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని టులిప్ తోట. ఇది ఆసియాలోనే అతిపెద్ద టులిప్ తోట.[1] ఇది దాదాపు 30 హెక్టార్ల (74 ఎకరాలు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[2] ఇది దాల్ సరస్సుకి అభిముఖంగా జబర్వాన్ శ్రేణి దిగువన ఉంది. కాశ్మీర్ లోయలో పూల పెంపకం, పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఉద్యానవనం 2007లో ప్రారంభించబడింది.[3] దీనిని గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచేవారు.[4] దాదాపు 1.5 మిలియన్ అనేక రంగుల టులిప్ పూలను ఆమ్స్టర్డామ్ లోని క్యూకెన్హాఫ్ టులిప్ గార్డెన్ నుండి తీసుకువచ్చారు.[5] అంతేకాకుండా హాలండ్ నుండి తెచ్చిన డాఫోడిల్స్, హైసింత్లు, రనానుక్యులస్ తో సహా 46 రకాల పువ్వులు ఇక్కడ ఉన్నాయి. టులిప్ తోటలో దాదాపు 68 రకాల టులిప్ లు ఉన్నాయి. ఈ తోట ఏడు అంచెల శైలిలో ఏటవాలు నేలపై వేయబడింది.
ఇందిరా గాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్ | |
---|---|
రకం | ఉద్యానవనం |
స్థానం | పీర్ పంజాల్ రేంజ్, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 34.096056°N 74.88003°E / 34.096056; 74.88003 |
విస్తీర్ణం | 30 ha (74 acres) |
Opened | 2007 |
యాజమాన్యం | జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం |
నిర్వహిస్తుంది | డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్లోరి-కల్చర్ |
సందర్శకులు | 3,60,000 (2022) |
స్థితి | తెరిచి ఉంది |
మొక్కలు | 1.5 మిలియన్ |
వర్గం | 68 |
సేకరణలు | టులిప్ లు |