ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఆంగ్లం: Andhra Pradesh Tourism Development Corporation) భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచే ప్రభుత్వ సంస్థ. ఇది విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది.[1] దీని ఆధ్వర్యంలో హోటళ్లు, రిసార్టులు, బస్సులు లాంటి పర్యటన సౌకర్యాలు అందచేస్తున్నది. దీనితోబాటు సమాచార, రిజర్వేషన్ కేంద్రాలు, ధ్వని, కాంతి ఆకర్షణలు, తీరిక సమయపు పడవ ప్రయాణం, సమావేశాలకొరకు ఓడ ప్రయాణం సేవలు అందచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప చారిత్రక, సహజ నేపథ్యాన్ని సూచించే వారసత్వ, ప్రకృతిక, సాహస, ఆరోగ్య, గ్రామీణ పర్యటన ప్యాకేజీలను అందిస్తుంది.. తిరుపతి, హార్స్లీ హిల్స్, అరకు, విశాఖపట్నం, శ్రీశైలం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో రిసార్టులను నిర్వహిస్తుంది. 63 హైటెక్ కోచ్లు, 29 వోల్వో కోచ్లు, 8 ఎయిర్ కండిషన్డ్ హైటెక్ కోచ్లు, 4 సెమీ స్లీపర్స్, 11 మినీ వాహనాలు, 1 వింటేజ్ కోచ్, 10 క్వాలిస్ వంటి పలు వాహనాలను కలిగివుంది. ఇది విశ్రాంతి పర్యటనను కూడా ప్రోత్సహిస్తుంది.[2]
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ | |
---|---|
ప్రభుత్వ రంగం అవలోకనం | |
అధికార పరిధి | ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
ప్రధాన కార్యాలయం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
నినాదం | అంతా సాధ్యమే! |
మాతృ శాఖ | పర్యాటక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |