ఆంగ్లో-మైసూరు యుద్ధాలు
From Wikipedia, the free encyclopedia
ఆంగ్లో మైసూరు యుద్ధాలు అన్నవి 18వ శతాబ్ది ఆఖరు మూడు దశాబ్దాల పాటు మైసూరు రాజ్యానికి, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ (ప్రధానంగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాతినిధ్యం వహించింది), మరాఠా సమాఖ్య, హైదరాబాద్ నిజాంల కూటమికీ నడుమ జరిగిన యుద్ధాలు. హైదర్ అలీ, అతని వారసుడు టిప్పు సుల్తాన్ నలు దిక్కులా - బ్రిటీష్ వారు దక్షిణం, తూర్పు, పశ్చిమ దిక్కులుగా మూడు వైపుల నుంచి, మరాఠాలు, నిజాం ఉత్తర దిక్కు నుంచి చేసిన దాడిని ఎదుర్కొంటూ యుద్ధాలు చేశారు.[1] నాలుగవ యుద్ధం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వంశ పాలనను అంతమొందిస్తూ, మైసూర్ సామ్రాజ్యాన్ని అప్పటికే భారతదేశంలో ప్రధాన భాగంపై నియంత్రణ సాధించిన బ్రిటీష్ వారికి ప్రయోజనం చేకూర్చేట్టు విభజించేలా నిర్ణయాత్మకంగా ముగిసింది. 1799లో ఆఖరి ఆంగ్లో-మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ చనిపోయాడు.