ఆంగ్లో-మరాఠా యుద్ధాలు
From Wikipedia, the free encyclopedia
ఆంగ్లో-మరాఠా యుద్ధాలు అన్నవి భారత ఉపఖండంలో మరాఠా సామ్రాజ్యం, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీల నడుమ జరిగిన మూడు యుద్ధాలు. 1775-82లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, 1803-05లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, 1816-19లో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం లేక పిండారీ యుద్ధం జరిగాయి.