అణుపరీక్ష
From Wikipedia, the free encyclopedia
అణ్వాయుధ పరీక్షలు (ఆంగ్లం: Nuclear weapons tests), అణ్వాయుధాలను పరిశోధించడానికి, చేపట్టే పరీక్షలే, ఈ అణ్వాయుధ పరీక్షలు లేదా అణుపరీక్షలు. ఇరవై శతాబ్దంలో, అనేక దేశాలు పోటా పోటీగా ఈ పరీక్షలు జరిపి, పరోక్షంగా యుద్ధరంగాలను సిద్ధం చేసాయి.
ప్రప్రథమ అణుపరీక్ష అమెరికా 1945 జూలై 16 న "ట్రినిటీ సైట్" అనే చోట, చేపట్టింది. దీని వలన 20 కిలోటన్నుల శక్తికి సమానంగా శక్తి వెలువడింది. అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. అతిపెద్ద అణుబాంబు సోవియట్ యూనియన్కు చెందిన త్సార్ బోంబా, 1961 అక్టోబరు 30 న 'నొవాయా జెమ్ల్యా' వద్ద పరీక్షింపబడింది. దీని శక్తి విలువ 50 మెగాటన్నులు.
అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1]