అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
ప్రతి సంవత్సరం మార్చి 21 నిర్వహించబడుతోంది. / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21 నిర్వహించబడుతోంది.[1][2] 1960లో, వర్ణవివక్ష పాస్ చట్టాలకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలోని షార్ప్విల్లేలో జరిగిన శాంతియుత ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పులలో 69మంది మరణించగా, 180మంది గాయపడ్డారు. 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అన్ని రకాల జాతి వివక్షలను తొలగించడానికి తన ప్రయత్నాలను రెట్టింపు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ మార్చి 21వ తేదీని జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది.[3]